పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల..

  • కోరుకొండ మండలంలో సుడిగాలి పర్యటన చేస్తూ పలువురు కుటుంబాలను ఓదార్చిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి..

రాజానగరం: కోరుకొండ మండలంలో గాదరాడ, నరసాపురం, బూరుగుపూడి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను రాజానగరం నియోజవర్గం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, మనోధైర్యం చెప్పి… స్వర్గస్తులైన వారికి శ్రద్ధాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం జరిగింది.. ముందుగా గాదరాడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన గుత్తుల పాపారావు, చీర్ల సత్యవతి, కుంచే లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం నరసాపురం గ్రామానికి చెందిన చోంగ అన్నవరం భార్య త్రివేణి , చోంగ రామాదాసు, అడపా వెంకటేశ్వరరావు భార్య వీరవేణి, మారుకుర్తి వాడపల్లి కొద్దిరోజుల క్రితం వీరు మృతి చెందగా…. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి… చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. నరసాపురం గ్రామం, కట్ట శివరామ కృష్ణ ఇటీవల అకాల మరణం చెందగా.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పడం జరిగింది. సీనియర్ నేతలు మట్ట నాగేశ్వరావు, ప్రగడ దేవి వరప్రసాద్, చదువు శ్రీను, బొజ్జపు సత్యనారాయణ, కలివిలిపిల్లి వీరబాబు, చొంగ మణి, అడ్డాల రఘు, దాకారపు చిన్ని, నాగిరెడ్డి విష్ణు, కట్ట సూరిబాబు, మేడిద సాయి,తోట అనిల్ వాసు, యర్రంశెట్టి పొలారావు, సుభాష్, తదితర నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.