అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ నియోజకవర్గం: గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బిల్లపాడు గ్రామంకు చెందిన చంద్రాల ఉషా కళ్యాణి ఆపరేషన్ కొరకు బి పాజిటివ్ రక్తం అవసరం రావడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులను సంప్రదించగా వెంటనే స్పందించి గుడివాడ పట్టణ జనసైనికులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే సంకల్పంతో గుడివాడ పట్టణంలో అనేకసార్లు రక్తదానాలు చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని అదేవిధంగా బుధవారం బిల్లపాడు గ్రామానికి చెందిన మహిళకు రక్తదాత నాగరాజు గారితో రక్తదానం ఇప్పించడం జరిగింది. అడిగి వెంటనే స్పందించిన రక్తదాత నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గుడివాడ పట్టణంలో ఉన్న యువత అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నూనె అయ్యప్ప, చరన్ తేజ్, కిరణ్, సురేష్, గంటా అంజి పాల్గొన్నారు.