పలువురికి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించిన బత్తుల

  • కొండగుంటూరు, భూపాలపట్నం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన ఇరువురి కుటుంబాల సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామానికి చెందిన జనసైనికుడు వెంట్రపాటి బాలాజీ నానమ్మ వెంకయ్యమ్మ ఇటీవల నిర్యాణం చెందగా.. వారి కుటుంబాన్ని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించి, మనోధైర్యం చెప్పారు. అదేవిధంగా భూపాలపట్నం గ్రామానికి చెందిన జనసైనికుడు తోరాటి శ్రీను తండ్రి నాగేశ్వరావు ఇటీవల మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బత్తుల బలరామకృష్ణ ధైర్యం చెప్పారు. వీరివెంట భూపాలపట్నం సర్పంచ్ గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అరిగెల రామకృష్ణ, జగతా భద్రరావు, నంద్యాల కాళీ కృష్ణ, అరిగెల సతీష్, పల్లస్వామి, తపస్సి, మెండీ సత్తిబాబు మరియు నాయకులు, జనసైనికులు ఉన్నారు.