యువరాజ్ సింగ్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

టీమిండియా మాజీ డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. రిటైర్మెంట్ అనంతరం.. మళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనుకున్న యూవీ కలలకు కళ్లెం వేసింది. దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన సమ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ త్వరలో జరగనుంది. ఈ టోర్నీ ద్వారా యువరాజ్ క్రికెట్‌లో పునరాగమని చేయాలని భావించాడు. అయితే బీసీసీఐ అందుకు నో చెప్పింది. బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో ఆడేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే బీసీసీఐ నో చెప్పడానికి పెద్ద కారణమే ఉందట. గత సంవత్సరం జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ గుడ్‌పై చెప్పిన విషయం తెలిసిందే. అయితే రిటైర్మెంట్ తరువాత యూవీ గ్లోబల్ టీ20 కెనా, టీ10 లీగ్‌లలో యూవీ ఆడాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ లీగ్‌లలో ఆడిన ఏ భారత క్రికెటర్ అయినా.. దేశాళీల్లో ఆడేందుకు అనర్హులు. ఈ కారణంగానే యువరాజ్ రీఎంట్రీకి బీసీసీఐ రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *