కొత్తపల్లి రైల్వేఅండర్ గ్రౌండ్ బిడ్జి నీటి గుంతల సమస్యను పరిష్కరించాలని బెల్లంపల్లి జనసేన డిమాండ్

బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూర్ మండలంలోని కొత్తపల్లి రైల్వేఅండర్ గ్రౌండ్ బిడ్జి నిర్మించారు. కొత్తపల్లి తాండూరు రేచిని అచ్చూలపూర్ వెళ్ళే ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించుటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నీరు నిల్వ ఉండటం వల్ల మరియు నీటి గుంతలు ఉండటంతో రాకపోకలకు తీవ్రఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు కూడా రైల్వే అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఇన్ని రోజులు అవుతున్నా… ఈ రైల్వేఅండర్ బ్రిడ్జ్ ప్రయాణ మార్గం సమస్యను పట్టించుకోకపోవడం చాలా సిగ్గు చేటు. ఇప్పటికైనా రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లు తెరచి ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టి తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ యువ నాయకులు సదాల కార్తీక్, గుర్రం అరుణ్, శనిగరపు దుర్గాప్రసాద్, టేకం అంజి, అసంపల్లి నవీన్, ఎండి మొయినోద్దీన్, గుమ్ముల వినీత్, కామేరా తరుణ్, తాని సాయి, కోడిపే సాయి తదితరులు పాల్గొన్నారు.