కళ్యాణదుర్గం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాలతో 18,19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దుస్థితిపై క్యాంపెనింగ్ లో భాగంగా “జనసేన-తెలుగుదేశం” పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం కుందుర్పి మండలంలో, మహంతాపురంలో గల రోడ్డులో నిరసన కార్యక్రమంను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి ఇంచార్జ్ వర్యులు ఉమామహేశ్వరనాయుడు మరియు జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత “జనసేన-తెలుగుదేశం” ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోపు నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం రోడ్లన్నీ వేయిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని “జనసేన-తెలుగుదేశం” పార్టీల మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.