రాజాం జనసేన కార్యాలయంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

రాజాం నియోజకవర్గం, స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా రాజాం పట్టణ జనసేన నాయకులు నమ్మి దుర్గారావు ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజాం మండల నాయకులు సామంతులు రమేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ మనమధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ ప్రతి భారతీయ పౌరుడు గుండెల్లో పదిలంగా నిలిచిపోయారు అని అన్నారు. ప్రతి ఒక్క యువకుడు భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, కళా వెంకట్రావు, దాలి నాయుడు తదితరులు పాల్గొన్నారు.