అడవి తల్లి మాట.. భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా తాజా ఫోర్త్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అడవి తల్లి అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో పవన్ రానా నిత్యా మీనన్, సముద్రఖని ఇలా అందరూ కనిపించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాయగా కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి పాడారు. ఇక ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందిస్తున్నారు.