రెడ్డి దుర్గారావు కుటుంబాన్ని పరామర్శించిన భూపతి అర్జున్

రణస్థలం మండలం, పతివాడ పాలెం గ్రామానికి చెందిన జనసేన కోసం తపనపడే జనసైనికుడు రెడ్డి దుర్గారావు (28) ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. దుర్గారావుకు భార్య, ఇద్దరు పిల్లలు..బాబుకి మూడు సంవత్సరాలు, పాపకి 15 నెలలు. ఉండడానికి ఇల్లు తప్పించి సెంటు భూమి కూడా లేని కుటుంబం. వీరి పరిస్థితి చూసి ఇక్కడ ఉన్న వాళ్ల హృదయాలను కలచివేసింది. భూపతి అర్జున్ దుర్గారావు కుటుంబాన్ని పరామర్శించి.. వారితో మాట్లాడి.. వారి పిల్లల భవిష్యత్తు కి అండగా ఉంటామని.. విషయాన్ని పార్టీ పెద్దలకు తెలియజేస్తామని మనోధైర్యం ఇచ్చారు. భూపతి అర్జున్ తో పాటు చిరంజీవి, రెడ్డి భాస్కర్, బొంతు విజయకృష్ణ, తమ్మినేని శ్రీనివాస్, రెడ్డి వెంకటరమణ, చిన్న, సాయి, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.