జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పిఠాపురం మండలం కోలంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జనసైనికుడు పెదిరెడ్ల కృష్ణ అర్జున్ వారి కుటుంబాన్ని గురువారం జనసైనికులు నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి అర్జున్ చిత్రపటానికి నివాళులు అర్పించి.. ప్రగాఢ సానుభూతి తెలియజేసి.. వారి కుటుంబ సభ్యులకు అన్నివిధాలుగా అండగా ఉంటానని మనోధైర్యాన్ని చెప్పి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు.. గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, గోపు సురేష్, పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, ఎంపీటీసీ అభ్యర్థి కేతినీడి గౌరీ నాగలక్ష్మి, మిరియాల చిట్టి, శిల్పా ఆది, గణేశల లోవ సుబ్బారావు, సిపిత సుబ్రహ్మణ్యం, ఎస్. ఏసుబాబు, నంద్యాల నాగబాబు, కరెడ్ల రాజు, దుర్గయ్య, యండ్రపు శ్రీనివాస్, మాదేపల్లి పద్మరాజు, మేళం బాబి, తోట సతీష్, కంద సోమరాజు, కసిరెడ్డి నాగేశ్వరరావు, కొన మంచిలి దుర్గాప్రసాద్ పబిరెడ్డి దుర్గాప్రసాద్, నమ శ్రీకాంత్, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.