తాడేపల్లిగూడెంలో వైసీపీకి భారీ షాక్

తాడేపల్లిగూడెంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు శనివారం సుమారు 500 మంది అనుచరులతో జనసేన పార్టీలో చేరారు. జనసేన నియోజకవర్గం ఇంచార్జ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో మారం కుమారుడు గిరీష్, కొడాలి సత్యనారాయణ లతోపాటు మరో 500 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ చేరికల సందర్భంగా పట్టణంలోని ఎస్వీఎస్ సర్కిల్ నుంచి ఎం వి ఆర్ లాడ్జి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బొలిశెట్టికి గజమాలతో స్వాగతం పలికి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన, తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు అవినీతి వ్యవహారంతో తాడేపల్లిగూడెం వాసులందరూ బెంబేలెత్తిపోతున్నారని ఈ రాక్షస పాలనకు అంతం పలకాలని ఎదురుచూస్తున్నారు అన్నారు. తమ సొంత కాళ్లపై నిలబడే వ్యాపారం చేసుకునే వారు కూడా స్వేచ్ఛగా తాడేపల్లిగూడెంలో ఉండలేకపోతున్నారన్నారు. దానికి నిదర్శనమే ఈ చేరికలనీ స్పష్టం చేశారు.