సర్వేపల్లిలో జనం కోసం జనసేన 29వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, గొలగముడి గిరిజన కాలనీ నందు మంగళవారం జనం కోసం జనసేన 29వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగు చదవడం రాదు. ఎవరన్నా చెప్పింది తెలుగులో చెప్పింది కూడా అర్థం చేసుకునే స్థితిలో లేడు ఆయనకు ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే దానిని చూసి కూడా చదవలేని స్థితిలో ఉన్నాడు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లతోపాటు వాలంటరీ వ్యవస్థను కూడా అలాగే తయారు చేయాలని చూస్తున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా క్షుణ్ణంగా బంగారు భవిష్యత్తు కలిగిన యువత వాళ్ళ భవిష్యత్తుని వాళ్లని అన్ని విధాల వాడుకొని సర్వనాశనం చేస్తున్న వైసీపీ పార్టీ అనే విధంగా వివరించడం జరిగింది. ఆ వివరణని వీళ్ళకి పూర్తిస్థాయిలో అర్థం కాకపోగా వీళ్ళు అనేక విధాలుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు పెట్టాలని ఆలోచనతో వీళ్ళకి తొత్తులైనటువంటి కొంతమంది చేత ఆయన ఫోటోలను తగలబెట్టడం, చెప్పులు దండలు వేయడం అనే అండ చందంగా శునకానందాన్ని పొందుతూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని, యువతని గాలికి వదిలేసి కోట్ల రూపాయల అవినీతి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి ఇకనైనా నీ పైశాచికపు చేష్టలను మానుకొని రాజ్యాంగబద్ధంగా నియమ నిబద్ధతతో పరిపాలన కొనసాగించాలని, అదేవిధంగా యువతని తప్పుడుగా పట్టేవకుండా వాళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలని మేము గౌరవప్రదంగా హితువు చెప్తున్నా మీరు అలా విని అర్థం చేసుకోలేని పక్షంలో మీకు ఎలా చెప్పాలో కూడా మాకు తెలుసు మేము చెప్పే విధానంతో చెప్పి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి సామర్థ్యాలు జనసేన పార్టీకి ఉన్నాయి కాబట్టి ఇకనైనా మారండి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ఖాజా, శ్రీహరి, అశోక్, దినేష్, సుమన్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.