సీతంపేటలో రక్తదాన శిబిరం

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలో కే గుమ్మడ గ్రామంలో బేతని హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీతంపేట జనసేన నాయుకులను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశ్యం గురించి సాయి, శ్రీకాంత్, విశ్వనాధం, గణేష్, ఉపేంద్ర, సింహాద్రి మాట్లాడుతూ… జనసేన పార్టీకి కుల మత పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరుని ఆదుకోవడమే జనసేన అదినాయకులు పవన్ కళ్యాణ్ ఆలోచనలే మా ఆలోచనులుగా పని చేస్తున్నాం జనంకోసం జనసేన, ప్రజలు కోసం పవన్ కళ్యాణ్ అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన సీతంపేట మండలం జనసైనికులు అందరికీ మా టీమ్ అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.