బ్లూ షర్ట్స్ – బ్లూ మార్చ్ కార్యక్రమానికి ఆహ్వానం

హైదరాబాద్, తెలంగాణ ఉద్యమకారులు, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ని ఏప్రిల్ 14న జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న బ్లూ షర్ట్స్- బ్లూ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వెనకబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పేద ప్రజల కోసం ముందుకు సాగుతున్న ప్రజా నాయకుడు తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం నిరంతరం పరితపిస్తున్న నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని రావలసిందిగా ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించడం కోసం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బహుజన ముద్దుబిడ్డ నేమూరి శంకర్ గౌడ్ ని కలిసి ఆహ్వానించడం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మాదిగ జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ భైరపోగు సాంబశివుడు, మాదిగ బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ మాదిగ జేఏసీ అల్వాల్ సర్కిల్ సెక్రెటరీ ఎర్రమన్ భరత్ పాల్గొని ఆహ్వానించడం జరిగింది.