ఎర్రగుంట గ్రామంలోని జగనన్న లేఅవుట్ ను పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలోని ఎర్రగుంట వద్ద నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ స్థలంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి జగనన్న లేఅవుట్ వేయడం జరిగింది. గతంలో కూడా ఈ విషయంపై జనసేన పార్టీ గళం వినిపించింది. అయితే పేదలకి ఇచ్చింది గోరంతయితే పెద్దలకి కట్టబెట్టింది కొండంత. అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వారు ఇష్టానుసారం బయట వ్యక్తులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, కొన్ని స్వచ్ఛంద సంస్థలకి కేటాయించడం ఎంతవరకు సమంజసం. ఈ విలువైన ప్రభుత్వ స్థలం నేషనల్ హైవేకి ఆనుకొని ఉంది కాబట్టి కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇష్టానుసారంగా ముడుపులు తీసుకొని వాళ్లకు కట్టబెట్టారా. ఇదేనా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే మంత్రి నియోజకవర్గంలోనే ఇంత అవినీతి జరుగుతుంటే మరి ఎందుకు ఎవరు నోరు మెదపడం లేదు. ఎర్రగుంట లేఅవుట్ పై జనసేన గళం ఎప్పుడో వినిపించింది. అయినా ఇప్పటివరకు లేఅవుట్ మీద చర్యలు తీసుకున్న పరిస్థితులు లేవు. ఈ కార్యక్రమంలో రహీం, శ్రీహరి, రహమాన్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.