Farwaniya: వేగం పెంచిన “గల్ఫ్ సేన – జన సేన”

గల్ఫ్ ఆరు దేశాల జనసైనికుల ఆత్మీయ సమావేశం ఫర్వానియాలో జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచడం జరిగింది. గల్ఫ్ దేశాల్లో నివసించే జనసైనికులు నివాస ప్రాంతాలు మరియు పనిచేసే ప్రదేశాల్లో అందరికీ జనసేన ఆశయాలను వివరిస్తూ పార్టీనీ బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని సమావేశం ఏర్పరుచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.

కోవిడ్ కారణంగా ఎవరిని కలవలేకపోవడం జరిగిందని, ఇక నుంచి ప్రతివారం సమావేశం ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి “గల్ఫ్ సేన – జన సేన” తమ వంతు కృషి చేస్తుందని గల్ఫ్ జనసైనికులు తెలిపారు.