66వ వర్ధంతి సందర్భంగా బి.ఆర్ అంబేద్కర్ కు బొబ్బేపల్లి సురేష్ నివాళి

సర్వేపల్లి: మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం లోని తోటపల్లి గూడూరు మండలం నరకూరు దగ్గర అంబేద్కర్ విగ్రహానికి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 4వ తారీఖు తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరు వద్ద కార్యక్రమాన్ని ముగించుకొని వస్తున్న తరుణంలో నరుకూరు కాలవ వద్ద ఇటీవల రెండు బర్రెలు రూరల్ నుంచి నరుకూరు మీదగా వెళ్లే కాలవ మరి ఆ కాలవని కట్టారు గాని దానిపైన మూతలైతే వేయలేదు. మరి ఆ కాలవ లో రెండు బర్రెలు ఇరుక్కుపోయి రాలేని పరిస్థితుల్లో జెసిబి తో బయటకు తీయడం జరిగింది. ఆ విషయంపై ఆ పెద్దాయన మమ్మల్ని ఈ పంచాయతీ కాలువ మీద నాలుగు రాళ్ల తో మూతవేస్తే బర్రెల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ పని చెయ్యించండి అని చెప్పి మమ్మల్ని అడగడం వెంటనే రెండు రోజుల్లో ఆ కాలవపైన నాపరాళ్ళు వెయ్యిస్తాం అని చెప్పి మాటిచ్చాం ఆ మాట ప్రకారం ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నాపరాళ్ళను తీసుకెళ్లి ఆ కాలవ మీద వెయ్యించి మూగజీవాలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం జనసేన పార్టీ ఒక మాట ఇచ్చిందంటే నిస్వార్ధంగా చేతనైనంతవరకు పని చేసిపెడుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ప్రజలందరూ జనసేన పార్టీని ఆదరిస్తారని రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే జనసేన తోనే సాధ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ఠాగూర్, చిన్న, వెంకటేశ్వర్లు, కిరణ్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.