పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా.. జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు, జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు శుక్రవారం మధ్యాహ్నం దన్నానపేట గ్రామ చెరువులో పర్యటించారు. ఈ సందర్భంగా చెరువులో ఉన్న ప్రతి ఒక్క ఉపాధి కూలీలను కలవడం జరిగింది. జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు, యువతకు, పెద్దలకు, తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 52 రోజులు పూర్తి చేసుకుని పవనన్న ప్రజాబాట సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ.. ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్ర లో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని.. వారి కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈ సారి వైసిపి కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు
ఈ కార్యక్రమంలో దన్నానపేట గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.