ఫిషింగ్ హార్బర్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన బొబ్బిలి జనసేన నాయకులు

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు జనసేన జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మహంతి ధనుంజయ పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా మరో 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయని, ఈ కాలిపోయిన 45 బొట్లుపై 360 మంది మత్స్య కారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని స్థానికులు వివరించారు. ఈ మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి తగిన నష్ట పరిహారం అందేవరకు పోరాడుతమని తెలియచేసారు.