రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇరువురికి బొలిశెట్టి ఆర్థిక సహాయం

తాడేపల్లిగూడెం: ప్రజల కష్టాన్ని తెలుసుకొని సహాయం అందించాలి అని ముందు అడుగు వేయడంలో జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడూ ముందు ఉంటారు. అనే దానికి మళ్ళీ నిదర్శనం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండలం విప్పర్రు గ్రామానికి చెందిన బలిజ రాము ఇద్దరు కుమార్తెలు గంగభవాని(25), రమాదేవి(22)లకు ఇటీవల తాడేపల్లిగూడెం కొత్త బ్రిడ్జి మీద లారీ గుద్దడంతో భయంకరమైన ప్రమాదం జరిగిన విషయం తెలిసుకొని, ఆ ఆడబిడ్డల తండ్రి సామాన్య ఆటో డ్రైవర్ అవడంతో, పేదరికంతో ఇబ్బంది పడటం తెలియడంతో విప్పర్రు గ్రామ జనసేన ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 40 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో విప్పరు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.