బొలిశెట్టి సత్య మాతృమూర్తికి నివాళులు అర్పించిన పితాని

వైజాగ్: రాష్ట్ర జనసేన పార్టీ పర్యావరణ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్య మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం వారికి నివాళులు అర్పించి, సత్య వారి ఇంటివద్ద పరామర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. వీరివెంట జనసేన పార్టీ ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దూడల స్వామి ఉన్నారు.