భవిష్యత్తు కోసమే బిజెపికి ఓటు వేయండి: జేరిపోతుల సనత్ కుమార్

తెలంగాణ, భూపాలపల్లి: భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి చందు పట్ల కీర్తి రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటించిన జనసేన జిల్లా నాయకులు జేరిపోతుల సనత్ కుమార్.. జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కీర్తి రెడ్డిని గెలిపించాలని రేగొండ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గణపురం మండలం నాయకులు పైడిమల్ల రాజు, శాయంపేట మండలం రాజోజు సాయి కుమార్, మరియు చందన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.