ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్నీ మోసపూరిత వాగ్దానాలే జనసేన పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, అధికారం రాకముందు ఇచ్చిన వాగ్దానాలు అధికారం వచ్చాక వైసీపీ ప్రభుత్వం పక్కకు పెట్టిందని బొలిశెట్టి అన్నారు. తాడేపల్లిగూడెం లింగారాయుడు గూడెం గ్రామంలో సోమవారం జరిగిన పల్లె పోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దాదాపు మూడున్నర ఏళ్లు కావస్తున్న ప్రజల సమస్యలను పట్టించుకోకపోగా పట్టణంలో, గ్రామంలో జగనన్న కాలనీలో అవకతవకలు జరిగాయని తాడేపల్లిగూడెం శ్రీనివాస్ అన్నారు. ఇకనుంచి ప్రతి సమస్యపై ప్రభుత్వంపై ఉద్యమం బావుట ఎగురవేస్తామన్నారు. ఇసుక కొరత విద్యుత్ లైన్లు రహదారులు డ్రైనేజీల నిర్మాణం ఇలా ప్రతి మౌలిక సదుపాయల గురించి ప్రజల తరఫున ప్రభుత్వంపై తిరగబడతామన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, లింగారాయుడు గూడెం జనసేన నాయకులు జనసైనికులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.