ఐ.పోలవరం: ‘మార్పు’ మొదలయ్యింది టిడిపి నుండి జనసేనలోకి

రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలక్రిష్ణ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ కందుల దుర్గేష్ సమక్షంలో ముమ్మిడివరం నియోజకవర్గం జి వేమవరం గ్రామ మాజీ సొసైటీ ప్రెసిడెంట్ కోళ్ల వీరభద్రరావు మరియు ఐ.పోలవరం శెట్టిబలిజ సంఘ యువజన అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గ గణేష్ టీడీపీ నుండి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి కందుల దుర్గేష్ పార్టీ కండువా కప్పి జనసేన పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గోన్నారు.