ఘనంగా బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గ: తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు గత ఐదు రోజుల నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం జరిగిన కార్యక్రమంలో స్థానిక తెలికచర్ల గ్రామంలో శివాలయంలో జనసేన నాయకులు మట్టా రామకృష్ణ ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ తో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయించారు. అనంతరం నీలాద్రిపురం శివాలయం నందు కీర్తి రాజేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అన్నసమారాదన మరియు పెంటపాడు మండల ఉపాధ్యక్షులు కాజులూరి మల్లేష్ ఆధ్వర్యంలో వానపల్లిగూడెం శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం అనంతరం అక్కడ భక్తులకు అన్నదానం, మాదాసు ఇందు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం శివాలయం నందు ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం, మారంపల్లి జనసేన యూత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, ఎల్ అగ్రహారం జనసేన యూత్ ఆధ్వర్యంలో అంగన్వాడీలో పిల్లలకు పుస్తకాలు కుర్చీలు పంపిణీ, తాడేపల్లిగూడెం 31వ వార్డులో మామిడి అచ్చుబాబు ఆధ్వర్యంలో అక్కడ స్థానికులకు మొక్కలు పంపిణీ మరియు మారంపల్లి జనసేన యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ముందుగా బొలిశెట్టి శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడబాలనారాయణమూర్తి, రామిశెట్టి సురేష్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబి, అడపా ప్రసాద్, యాంట్రపాటి రాజు, కేశవబట్ల విజయ్, నీలపాల దినేష్, పెనుబోతుల బాలాజీ, నల్లకంచు రాంబాబు, అడ్డగర్ల సూరి, మాదాసు ఇందు, చాపల రమేష్, అత్తిలిబాబి, గోగు కిరణ్, బయనపాలేపు ముఖేష్, పిడుగు రామ్మోహన్, అడబాల మురళి, సుర్పన్న శ్రీను, కోట శ్రీరామ్, లోవరాజు, నాగు వెజ్జురత్నకుమారి, గరగ విష్ణు ప్రియ, అలెక్య, పెనుబోతుల సోమాలమ్మ మధుమతి, లక్ష్మీప్రసన్న, విజయ, తులసి, కళ్యాణి, ప్రభా శ్రీ, రాజేశ్వరి, గాయత్రి, విజయ, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.