వంగవీటి మోహన్ రంగాకు ఘన నివాళులు

రాజోలు: సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం కాలవమోగ సెంటర్ నందు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి సందర్భంగా పోతురాజు నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో రత్న మెమోరియల్ ఎస్సీ సంక్షేమ సంఘం మరియు గ్రామస్తుల సమక్షంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చొప్పాల బాబూరావు, ఉండపల్లి అంజి, రావూరి నాగు, చొప్పల మర్తయ్య, చేవ్వాకుల సోమరాజు, ఏనూముల తాతాజీ, మేడిది మోహన్, పోతు రాజు కృష్ణ, కేశవదాసుపాలెం, అంతర్వేదికర, గొంది గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.