సావిత్రిబాయి పూలేకు శుభాకాంక్షలు తెలిపిన అంబేద్కర్ ఇండియా మిసన్ యువత

పాలకొండ: సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా మన్యం జిల్లా వీరఘట్టం మండలం నడుకురు గ్రామ అంబేద్కర్ ఇండియా మిసన్(ఎయిమ్) యువతను అంబేద్కర్ ఇండియా మిషన్ వీరఘట్టం మండలం ఇంచార్జ్ వజ్రగడ రవికుమార్(జానీ) కలవడం జరిగింది. ఈ సందర్బంగా జానీ మాట్లాడుతూ దళిత, బహుజన స్త్రీ జనోద్దరణకు, మహిళ విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగమయి, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, మహిళకు మొట్టమొదటి పాఠశాల స్థాపించిన గొప్ప సంఘ సంస్కర్త, సమ సమాజ స్థాపన కోసం మహిళ విద్యా కోసం అలుపెరుగనిపోరాటం చేసిన గొప్ప మహా తల్లీ మన సావిత్రిబాయి పూలే గారికి అంబేద్కర్ ఇండియా మిసన్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం నడుకురు గ్రామ ఎయిమ్ యువత పాల్గొన్నారు.