జనసేన-టీడీపి ఉమ్మడి కార్యాచరణపై సమావేశం

నెల్లిమర్ల నియోజకవర్గం: జనసేన-టీడీపి ఉమ్మడి కలయిక సభకు ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-టిడిపి కో-ఆర్డినేటర్ అరియు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీమతి లోకం మాధవి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై జనసేన పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడి కార్యాచరణపై దశ-దిశ నిర్దేశించడం జరిగింది. అనంతరం పార్వతీపురం జనసేన కార్యాలయంలో పార్వతీపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి లోకం మాధవిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.