యాక్సిడెంట్ కి గురైన నరేష్ కి బొర్రా ఆర్ధిక సహాయం

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, కుంకులగుంట గ్రామానికి చెందిన ఊస నరేష్ (వయస్సు 35) యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు కుంకులగుంట వారి నివాసంలో ఊస నరేష్ నీ పరామర్శించి, ఆర్ధిక సహాయం చేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఆలాగే అదే గ్రామానికి చెందిన గుండూరి కొండలు వయస్సు 50 అనారోగ్యంతో బాధ పడుతున్న కొండల్ని పరామర్శించారు అలాగే ఆర్ధిక సహాయం చేసారు వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసాని ఇచ్చారు. అలాగే అదే గ్రామానికి చెందిన పల్లప్పునేనిసౌజన్య వయస్సు 11 స్కూల్ కి వెళ్లొస్తుండగా బైక్ తగిలి చేయి విరిగిన విషయం తెలుసుకొని వెళ్లి పరామర్శించారు. అలాగే ఆర్ధిక సహాయం చేసారు వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.