నియోజకవర్గ అభివృద్ధి జనసేన తోనే సాధ్యం: చిరంజీవి యాదవ్

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు వరదయ్యపాలెం మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ మండలంలోని కరిపాకం, రాచకండ్రిగ, బత్తల వలం, చేదుల పాకం, గ్రామాలలో జనసైనికులతో కలసి పర్యటన చేయడం జరిగింది. పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకోటం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలు నరకయాతన పడుతున్నారని, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, అవినీతికి తావులేని పరిపాలన అందిస్తామని ప్రజలకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తులసి, శేఖర్, యుగంధర్, సాయి, వెంకటేష్, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.