తొండపి గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకున్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, తొండపి గ్రామ శివాలయ గుడి కమిటీ వారి ఆహ్వానం మేరకు ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గం నాయకులు బొర్రా వెంకట అప్పారావు తొండపి గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకోవడం జరిగినది. నూతన శివాలయానికి ప్రతిష్టకు మరియు అంకమ్మ తల్లి ఆలయం ప్రతిష్టకు సంబంధించి జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు 50002 వేల రూపాయలు విరాళాన్ని అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నర్సయ్య, సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, సత్తెనపల్లి కౌన్సిలర్ రంగి శెట్టి సుమన్, మాజీ సర్పంచ్ చిలకాసత్యం, దమ్మాలపాడు సర్పంచ్ వెంకటేశ్వర్లు, రుద్ర జడ బుల్లబ్బాయి, జనసైనికులు పాల్గొనడం జరిగినది.