శివరామపట్నం గ్రామంలో జనం కోసం జనసేన 521వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 521వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం శివరామపట్నం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 150 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 80500 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 522వ రోజు శనివారం మధ్యాహ్నం 4 గంటల నుండి గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. శివరామపట్నం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గాబు రామకృష్ణ, బట్ర దొరబాబు, మండపాక సర్వేశ్వరరావు, గాబు శంకర్, రాకోటి సతీష్, అప్పికొండ సింహాద్రి, తోలేటి అర్జున, అప్పికొండ డేవిడ్ రాజు, తోలేటి శివ, మండపాక ధర్మ, ములగాడ నాగ ప్రసాద్, బన్ను, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా శివరామపట్నం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గాబు రామకృష్ణ కుటుంబ సభ్యులకు, రాకోటి సత్తిబాబు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.