వీరభద్రుడు, వినాయక ఆలయాల నిర్మాణానికి విరాళం అందించిన బొర్రా వెంకట అప్పారావు

నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబదుతున్న వీరభద్రుని స్వామి ఆలయ నిర్మాణానికి 1,00,002 వేల రూపాయలు, అలాగే వినాయకుడి ఆలయ నిర్మాణానికి 50,002 వేల రూపాయలను సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు ఆరవ వార్డు నెంబర్ చేపూరి వెంకటేశ్వర్లు, ఏడవ వార్డు మెంబర్ చేపూరి వెంకటేశ్వర్లు, మండల కమిటీ సెక్రటరీ పసుపులేటి మురళి, బాదినీడి సుబ్బారావు, గ్రామజనసైనికులు పాల్గొనడం జరిగింది.