జనసేన ఆత్మబంధు యాత్రకి రాజుగుంటలో అశేష ఆదరణ

ఉమ్మడి కడప జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాన్ని ప్రతి ఇంటికి చేర్చుతూ ప్రతి గుండెను తాకుతూ సాగుతున్న ఆత్మబంధు యాత్ర ఆదివారం సాయంత్రం చిట్వేలి మండలము రాజుగుంట గ్రామంలో దిగ్విజయంగా జరిగింది. మహిళలు, నాయకులు గ్రామ పెద్దలు, అన్నిటిని మించి యువత యాత్రలో పాల్గొనే నాయకులకు, పూలమాలలు, సత్కారాలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ పెద్దలు ఎంపీటీసీ నాగార్జున, ఆనాల సునీల్, నానబాల నాగేశ్వరరావు, ఆచారి శంకరయ్య, పుచ్చకాయల శ్రీను, గుత్తి శివయ్య, మోహన్, ప్రసాద్, వెంకట రమణ, మాదినేని కనక రాజు, మాదినేని మల్లికార్జున, బాబు, రాసు సుబ్బారాయుడు, రాజ, రెడ్డయ్య గారి నరసింహులు, నానబాల నాగరాజ, కిట్టయ్య, విశ్వనాథం తదితర గ్రామ పెద్దలను కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కరపత్రములతో ప్రచారం సాగింది. ముఖ్యంగా గ్రామంలోని ఎన్నారైలు లోకనాధ్, నానబాల రఘురామ్, చంద్ర, పసల పురుషోత్తం, మద్దూరి శివధన, పసల మహేంద్ర, పసల బాబు, శివ, చిన్నారావు, నాగేంద్ర, విజయ్, నానబాల బాలాజీ, గుత్తి ప్రసాద్, పసల శివ, దినేష్, మదినేని ప్రసాద్, సంతోష్, చిట్టి శంకరయ్యలు రాజుగుంట జనసేన యువత పసల సబ్బు, నానబాల చిన్న రాయల్, కొడిదల రాధా కృష్ణ ,గుత్తి ప్రసాద్, నానబాల శంకరయ్య, కృష్ణ నారాయణ, ప్రసాద్, పవన్, చరణ్, అరుణ్, ఆంజనేయులు, రెడ్డయ్య, శివ, చక్రి, వంశీ, బట్టు, నందకిషోర్ శశిధర్, మదన్,పటం నరసింహ లు ముందు వరసలో కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, నల్లంశెట్టి యానాదయ్య, జోగినేని మణి,గంధం శెట్టి దినకర్ బాబు, వరికూటి నాగరాజు, ముద్దపోలు రామ సుబ్బయ్య, గుగ్గీళ్ళ సుబ్బారాయుడు, పగడాల మణి ప్రసాద్, శ్రీకారం ప్రకాష్, మాదాసు నరసింహ, యద్దల అనంత రాయలు, కంచర్ల సుధీర్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, మాదాసు శివ, పగడాల శివ, కొత్తపల్లి నాగయ్య, అగ్రహారం పొన్నారెడ్డి, తిమ్మాయ పాలెం, మౌలానా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.