ముమ్మారెడ్డి ప్రచారాన్ని ముందుండి నడిపించిన బొర్రా

తెలంగాణ, కూకట్ పల్లి, బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బిజెపి జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎన్నికల ప్రచారం కూకట్ పల్లి 114 డివిజన్ లో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు ముందుండి నడిపించడం జరిగింది. ప్రచారం మొత్తం ప్రజలకు అభివాదం చేస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.. కూకట్ పల్లి 114 డివిజన్ 3వ ఫేసు లో రమ్య గ్రౌండ్ దగ్గర ప్రారంభమైన ప్రచారం 6వ ఫేసు వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు ప్రీతమ్ రెడ్డి, గంధం రాజు, జనసేన పార్టీ 114 డివిజన్ అద్యక్షులు ప్రసాద్, 115 డివిజన్ ప్రెసిడేంట్ సలాది శంకర్, బిజేపి నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.