అట్టహాసంగా ప్రారంభమైన బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్

రాజానగరం, శ్రీరంగపట్నం గ్రామంలో అట్టహాసంగా బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమవడం జరిగింది. ఈ టోర్నమెంటును రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ యువత చెడు సావాసాలకు తావు లేకుండా క్రీడల పట్ల దృష్టిపెట్టి క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని, క్రీడల్లో రాణించాలని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి సూచించారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ యూత్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల సహకారంతో డా.బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన మొదటి టీముకి 20000/- రూపాయలు, అలాగే ద్వితీయ బహుమతి 15000/- రూపాయలు, తృతీయ బహుమతి 10000/- రూపాయలు, 4 వ బహుమతి 5000/- రూపాయలు గెలుచుకున్న టీములకు అందించనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.