జెడ్.పి.నిధులతో వంతెన నిర్మాణ పనులు ప్రారంభం

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో స్థానిక జడ్పీటీసీ మట్ట శైలజ ప్రోత్సాహంతో జెడ్పీ నిధుల నుంచి 5 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణ పనులు గురువారం ప్రారంభమైనవి. చింతలపల్లి గ్రామంలో పలు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా వంతెన నిర్మాణంపై ప్రధానంగా దృష్టిపెట్టి స్థానిక మండలం వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు చొరవతో సుమారు 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో స్థానిక సర్పంచ్ శ్రీమతి మట్టా ప్రసన్నకుమారి సురేష్ తో వంతెన నిర్మాణం పనులుకు గురువారం కొబ్బరికాయ కొట్టి స్లాబ్ పనులు ప్రారంభించారు. తమ గ్రామానికి, వంతెన నిర్మాణానికి నిధులు సమకూర్చిన జడ్పీటీసీ మట్టా శైలజ గారికి, కృషి చేసిన వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజులకు స్థానిక ప్రజలు, పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తో పాటు, ఎంపీపీ కేతా శ్రీనివాస్, ఎంపీటీసీ మార్లపూడి ప్రసాద్, మాజీ సర్పంచ్ గడ్డం సత్యనారాయణ, నల్లి నాగబాబు, రుద్రా నరసింహారావు, బత్తుల సరస్వతిరావు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.