జనసేన, తెలుగుదేశం కలయికలో కొవ్వొత్తుల ర్యాలీ

పార్వతీపురం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలయికలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సబ్దర్భంగా పార్వతిపురం జనసేన మండల అధ్యక్షురాలు ఆగురు మణి మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మేలుకోసమే అని వైఎస్ఆర్సిపి అరాచక పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసి మా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. వైఎస్ఆర్సిపి నాయకులు మాట తీరు, మంత్రుల మాట తీరు మా పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఈరోజు విజయనగరంలో సి.ఎం జగన్మోహన్ రెడ్డి మా అధినాయకుడిపై చేసిన విమర్శలను మేము ఖండిస్తున్నాం. మా అధినాయకుడు ప్యాకేజీ తీసుకున్నట్లయితే మీరు మీ ప్రభుత్వం నిరూపించండి. సీఎం స్థాయిలో వ్యక్తి అలా మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు ఎలా మాట్లాడతారు. ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు బోనులు గోవిందమ్మ, ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లి గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, గణేష్, కర్రి మణికంఠ, అక్కెన భాస్కర్, అంబటి బలరాం, తిరుమలరెడ్డి కనకరాజు, పాత్ర పవన్, పైళ్ల అప్పలరాజు, దుర్గా, శంకర్, ప్రశాంత్, సాయి, మహేష్, అన్న బత్తుల దుర్గాప్రసాద్, జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేశారు.