దుద్దుకూరులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

గోపాలపురం నియోజకవర్గం: దేవరపల్లి మండలం, దుద్దుకూరు గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దీనికి టీడీపీ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ ముళ్ళపూడి బాపిరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొయ్యలమూడి చిన్నబాబు, సుధారాణి మరియు గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, గ్రామ అధ్యక్షులు సాంబ శ్రీను, బాలు, తాతబ్బాయి, బందపురం గ్రామ అధ్యక్షులు బాలం బాబి, సుందర్ సింగ్, కుమార్, మరియు జనసేన కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సువర్ణరాజు మాట్లాడుతూ ప్రజలు ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపాలని, రెండు పార్టీల కలయికతో రాష్ట్రం పూర్వవైభవం రూపుదిద్దుకుంటుందని అన్నారు.