పంతం నానాజీని పరామర్శించిన పితాని బాలకృష్ణ

కాకినాడ రూరల్: హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటిదగ్గర కోలుకుంటున్న కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీని గురువారం వారి స్వగృహమునందు జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. వీరితోపాటు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు మొదలగు వారు పాల్గొన్నారు.