లార్డ్స్ లో జెండా ఎగురవేసిన కెప్టెన్ కోహ్లీ..
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం లండన్లో జెండావిష్కరణ చేశాడు. దీనికి ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు మిగిలిన జట్టు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించి దేశ భక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది. ఇక నాలుగో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ ఆదిలోనే అవుటయ్యాడు. ఈ క్రమంలోనే పది ఓవర్లకు 18 పరుగులు చేశారు. మార్క్వుడ్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్(12) ఒక బౌండరీ బాదాడు. మరోవైపు పూజారా ఇంకా ఖాతా తెరవలేదు. భారత్ ఇంకా 9 పరుగుల లోటుపాటుతో ఆడుతోంది.
On the occasion of India's Independence Day, #TeamIndia members came together to hoist the flag 🇮🇳 🙌 pic.twitter.com/TuypNY5hjU
— BCCI (@BCCI) August 15, 2021