సిసి రోడ్లు నిర్మించాలి- జనసేన డిమాండ్

అశ్వారావుపేట: ములకలపల్లి మండలం, ములకలపల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ సెంటర్ లో ప్రధాన వీధి సీసీ రోడ్డుకు నోచుకుని పరిస్థితి. పలుమారు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోకపొవడంతో స్థానికులు జనసేన పార్టీ నాయకులకు తెలియజేయడం జరిగింది. అలాగే సుందరయ్య నగర్ గ్రామంలో గత కొన్ని నెలల క్రితం మంజూరైన సీసీ రోడ్డు ఇంతవరకు కూడా పూర్తి చేయకపోవడం గమనార్హం. ములకలపల్లి మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో సీసీ రోడ్లు మంజూరు అయినప్పటికీ సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములకలపల్లి మేజర్ పంచాయతీ అయినప్పటికీ పలు గ్రామాల్లో సీసీ రోడ్లు వేయకపోవడం దారుణం. ఈ సందర్భంగా ములకలపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ ప్రవీణ్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ పంచాయతీ ఆఫీస్ పక్క వీధికి సీసీ రోడ్డు వేయించాలని మరియు మండలంలో ఎక్కడ అయితే సిసి రోడ్లు మంజూరు అయి ఆగిపోయాయో ఆ రోడ్లకు సంబంధించిన పనులన్నీ తక్షణమే మొదలుపెట్టి పూర్తి చెయ్యాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఎక్కడ అయితే గ్రామాల్లో సీసీ రోడ్లు ఇంకా నిర్మాణ అవసరం ఉన్నాయో అక్కడ మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గరికే రాంబాబు, మండల నాయకులు ఎస్.కె రఫీ పాషా మడకం రామకృష్ణ, కుంజ పాపారావు, స్థానికులు నకిరికంటి వంశీ, ఎస్ కే జాన్ పాషా, సాయి తదితరులు పాల్గొన్నారు.