ఖమ్మం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ.. ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మిరియాల జగన్ మోహన్, నగర కన్వీనర్ ఎండి. సాదిక్ అలీ, బండారు రామకృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రెటరీ మైలవరపు మణికంఠ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పుల్లారావు, రమణ, సాత్విక్, కరిముల్లా సురేష్, రవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.