రాయలసీమ జనసేన జోన్ కమిటీ సభ్యులుగా చైతన్య రాయల్

మంగళగిరి: జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు సబంధించి జోనల్ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం విడుదల చేశారు. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ఆవుల చైతన్య రాయల్ కు రాయలసీమ జోన్ కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించారు. తనకు అవకాశం రావడంతో సోమవారం పార్టీ పీఏసీ చైర్మన్ నాదెళ్ళ మనోహర్ ను కలిసి శ్రీవారి ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు తీసుకుని, నియోజవర్గ నాయకులు పగడాల రమణ, విరూపాక్ష, నరేష్ రాయల్ లు కృతజ్ఞతలు తెలిపారు.