అడపా శ్రీనుని పరామర్శించిన చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: గత 4 రోజుల క్రితం రోడ్ ప్రమాదంలో రామానుజపురం గ్రామ కమిటీ అధ్యక్షులు అడపా శ్రీను గాయపడటం జరిగింది. సోమవారం వారిని మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇవ్వడం జరిగింది. మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్, మల్లాబత్తుల రాము, సరిపల్లి గ్రామకమిటీ అధ్యక్షులు ఉరింకల సత్తిబాబు, మంచాల యేసు పలువురు నేతలు పరామర్శించారు.