పింక్ హార్ట్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం

రాజోలు, పింక్ హార్ట్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ బాబు సారధ్యంలో గుడిమెల్లంక వెళ్లే రహదారిలో చలివేంద్రం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలికిపురం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరికోట శాస్త్రి, మలికిపురం ఎంపిపి మేడిచర్ల సత్యవాణి మరియు గుడిమెల్లంక సర్పంచ్ భర్త నల్లి ప్రసాద్. నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు పింక్ హార్ట్స్ సభ్యులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింక్ హార్ట్స్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో చేసి ఉన్నది అదే ఉత్సాహంతో, దేవుని ఆశీస్సులతో, ప్రజలందరి అండదండలతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని సగౌరవంగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం తీవ్రమైన ఎండలు ఉన్న అన్ని రోజులు చలివేంద్ర కార్యక్రమం నడుస్తుంది. ఈ సేవా కార్యక్రమంలో సహకరించిన అందరికీ ధ్యవాదాలు తెలియజేసారు.