జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మికి సన్మానం

సామాజిక ఉద్యమకారిణి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మికి ఆమె అంకితబావంతో సమాజంలో వివిధ వర్గాలకు అందిస్తున్న సేవలను గుర్తించి “మహాత్మా జ్యోతిరావు ఫూలే ఫౌండేషన్” వారు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని, చదువుల తల్లి, క్రాంతి జ్యోతి “సావిత్రి బాయి ఫూలే” 191వ జయంతి సందర్భంగా సోమవారం తిరుపతిలో ప్రముఖ సినీ నటులు, దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత సుమన్ తల్వార్ మరియు కుల, మత రహిత సర్టిఫికెట్ పొందిన మొట్టమొదటి భారతీయురాలు స్నేహ పార్తీపరాజా చేతులమీదగా “సావిత్రి భాయి ఫూలే ఎక్స్ లెన్స్ అవార్డు” ను ప్రధానం చేయడం జరిగింది.