పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన చల్లపల్లి జనసేన

అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం మనకెంతో గౌరవం అయిన జాతీయ జెండాను రూపొందించిన స్వర్గీయ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా చల్లపల్లి లోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.. చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణా, కృష్ణా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, చల్లపల్లి టౌన్ అధ్యక్షులు ముత్యాల ప్రసాద్, పాగోలు గ్రామ అధ్యక్షులు ముక్కొల్లు పోతురాజు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు విమల్ కృష్ణా మాట్లాడుతూ పింగళి వెంకయ్య మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అని అన్నారు.. ఆయన స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని అన్నారు.. కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్ మాట్లాడుతూ జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి కృషి ఎందరికో ఆదర్శం అని అన్నారు.. పింగళి వెంకయ్య గారు నడయాడిన నేల మనది అని అన్నారు.. జాతీయ జెండాను రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యడం జరిగింది..ఈ కార్యక్రమంలో బాదర్ల లోలాక్షుడు, మల్లంపల్లి నాంచారయ్య, మణికంఠ, పసుపులేటి రవి, కంతేటి చంద్రశేఖర్, యన్నం సురేష్, పినిశెట్టి నిరంజన్, సోమిశెట్టి రాఘవ, గోళ్ళ ప్రసాద్, శ్రీను పసుపులేటి, బెజవాడ సత్యనారాయణ, పోతన పిచ్చయ్య, పైడిపాముల కిరణ్ కుమార్, అవనిగడ్డ నియోజకవర్గ ఐ.టీ కోఆర్డినేటర్ సూదాని నందగోపాల్ మరియు తదితరులు పాల్గొన్నారు.