టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఛాలెంజర్స్‌

దుబాయ్ వేదికగా ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఈ రోజు రాత్రి నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ధోనీ వర్సెస్ కోహ్లి మధ్య పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో ఎనిమిది సార్లు ఇరు జట్లు తలపడగా… చెన్నై ఏడుసార్లు గెలుపొందగా.. బెంగళూరు ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.