బీసీ జనగణనపై మోడీకి చంద్రబాబు లేఖ..

ప్రధాని నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానిని కోరారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయని ఆ లేఖలో తెలిపారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని,  బీసీ జనగణనపై తమ ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కులాల వారీ వివరాలు… 90 ఏళ్ల నాటివని లేఖలో ఆయన పేర్కొన్నారు.